22, ఫిబ్రవరి 2014, శనివారం

ధర్మమునకె జయము దక్కె గాదె!



కంటిలోన 'పెపరు' కారమ్మునే గొట్టి,
"కలిపియుంచెద"మని గర్జసేయు
కఠినచిత్తుల కిక కనులు బైరులు గ్రమ్మె!
ధర్మమునకె జయము దక్కె గాదె!

జై తెలంగాణ!
జై జై తెలంగాణ!!

3 కామెంట్‌లు:

  1. నమస్కారములు ,
    మీరు కవిగా మంచి మంచి విషయములను అందరూ చెప్పిన విషయములైనా ఇంకొంచెం సరళంగా - పద్యాలను అందిస్తున్నారు ...మేము సంతోషిస్తున్నాము . కాని ఈ పద్య పూరణ లో "ధర్మం" గెలిచిందని చెప్పటం ఏ మాత్రం బాగుండలేదు. మీరు మా పొగడ్తలకో , విమర్శల కోసమో పద్యాలు రాయటం లేదని తెలుసు. కవి రాబోయే కాలం లో జరగ బోయే గొప్ప కార్యాలను చెప్ప గలగాలి. విభజన ప్రక్రియ మంచి పద్ధతిలో జరిగినట్టు మీకు ఎలా అనిపించిందండి .. ఒక్క సారి ఆలోచించండి - ధర్మం లాంటి పెద్ద పదాలు మీలాంటి వారు వాడటం ఎందుకో ధర్మం గా లేదు ..

    రిప్లయితొలగించండి
  2. తాడేపల్లి రత్నాకర్ గారు!
    హస్తినాపుర సామ్రాజ్య విభజనకై శ్రీకృష్ణ పరమాత్మ రాయబారమెందుకు నడిపాడో మీకు అర్థమయితే, నేనన్న "ధర్మం" ఎలా గెలిచిందో మీకు అర్థమవుతుంది. విభజన జరుగుతున్న వేళ ... తెలంగాణ ఉద్యోగులు 20%, సీమాంధ్ర ఉద్యోగులు 80% ఎందుకు ఉన్నారో మీరు నిష్పాక్షికంగా ఆలోచించి చెప్పగలిగితే, నేనన్న "ధర్మం" ఎలా గెలిచిందో మీకు అర్థమవుతుంది. ఒక్క సీమాంధ్ర మీడియా తప్ప ... దేశ, విదేశాలలోని మీడియా మొత్తం తెలంగాణ ఏర్పాటును ఎందుకు స్వాగతించాయో మీ బుర్రకు అర్థమయితే, నేనన్న "ధర్మం" ఎలా గెలిచిందో మీకు అర్థమవుతుంది. మీ హృదయ కాఠిన్యం తొలగించుకొని, ఒక్కసారి ... తెలంగాణ కోసం 1200 మంది యువకులు కళ్ళ ముందు కాల్చుకొని ఎందుకు చచ్చిపోయారో అర్థం చేసుకోగలిగితే, నేనన్న "ధర్మం" ఎలా గెలిచిందో మీకు అర్థమవుతుంది. అరవయ్యేళ్ళ సహజీవనం తరువాత కూడా యావత్తెలంగాణ సమాజం రోడ్ల పైకి వచ్చి ఉద్యమిస్తూ రాష్ట్ర విభజనను ఎందుకు కోరుకొన్నారో ఇంగిత జ్ఞానంతో ఆలోచించగలిగితే, నేనన్న "ధర్మం" ఎలా గెలిచిందో మీకు అర్థమవుతుంది. విభజనను వ్యతిరేకించే ప్రతి సీమాంధ్ర పార్టీ కూడా ఎన్నికల వేళల్లో "మేము తెలంగాణకు అనుకూలమే...!" అని ఎందుకు నాటకాలాడాయో మీరు విశ్లేషణ చేసుకోగలిగితే, నేనన్న "ధర్మం" ఎలా గెలిచిందో మీకు అర్థమవుతుంది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సమైక్యాంధ్ర ఉద్యమం పట్ల కనీస సానుభూతి కూడా ఎందుకు చూపలేదో మీకు అర్థమయితే, నేనన్న "ధర్మం" ఎలా గెలిచిందో మీకు అర్థమవుతుంది. గుజరాతీలు ముంబాయిని ఎంతో అభివృద్ధి చేసినా అది మహారాష్ట్రీయులకు ఎందుకు దక్కిందో అర్థం చేసుకొనే జ్ఞానముంటే, నేనన్న "ధర్మం" ఎలా గెలిచిందో మీకు అర్థమవుతుంది.

    రిప్లయితొలగించండి
  3. తాడేపల్లి రత్నాకర్ గారు!

    ఇంకా చాలా ఉన్నాయి ...
    బొగ్గు గనులన్నీ తెలంగాణలో ఉంటే అరవయ్యేళ్ళ సీమాంధ్ర పాలన తరువాత కూడ, సీమాంధ్రలో అదనపు విద్యుత్తు, తెలంగాణలో విద్యుత్ కొరత ఎందుకు ఉందో మీకు అర్థమయితే,నేనన్న "ధర్మం" ఎలా గెలిచిందో మీకు అర్థమవుతుంది.అరవయ్యేళ్ళ సీమాంధ్ర పాలనలో అదనంగా తెలంగాణకు ఎన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసారో ... సీమాంధ్రకు ఎన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలను ఏర్పాటు చేసారో ... న్యాయంగా బేరీజు వేసుకొని మీకు మీరు సమాధానం చెప్పుకోగలిగితే, నేనన్న "ధర్మం" ఎలా గెలిచిందో మీకు అర్థమవుతుంది. ఇన్నాళ్ళు తెలంగాణ భౌగోళికంగా ఎత్తులో ఉంది, సీమాంధ్ర పల్లంలో ఉంది కాబట్టి సీమాంధ్రకు సహజంగానే ఎక్కువ నీళ్ళు అందుతాయని బుకాయించునవాళ్ళు ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు నీళ్ళు రావని ఎందుకు ఏడుస్తున్నారో గుండెల మీద చేయి వేసుకొని "ధర్మం" ప్రవచించగలిగితే, అప్పుడు మీకు తప్పకుండా నేనన్న "ధర్మం" ఎలా గెలిచిందో మీకు అర్థమవుతుంది. ఇంకా ఇట్లా ఎన్నైనా ఏ తెలంగాణ సామాన్యుణ్ణి అడిగినా గంట్తల కొద్దీ వివరించగలడు. పదునాలుగేళ్ళుగా తెలంగాణ ప్రజలు ఎంత మొత్తుకున్నా విని అర్థం చేసుకొనే ప్రయత్నం చేయనివాళ్ళకు ఇప్పుడు ... నేనన్న "ధర్మం" ఎలా గెలిచిందో ఎట్లా అర్థమవుతుంది? రామాయణం అంతా అయ్యాక రామునికి సీత ఏమవుతుందన్నట్టు ... "ఇప్పుడు ధర్మం ఎలా గెలిచింది?" అని నటించడం ఎందుకండి? ప్రపంచం మొత్తానికి అర్థమయింది "ధర్మం ఎలా గెలిచిందో!". మీకు మరో వందేళ్ళయినా అర్థం కాదు. ఎందుకంటే నిద్ర పోయేవాణ్ణి మేల్కొల్పవచ్చు. నిద్ర నటించేవాణ్ణి కాదు.

    రిప్లయితొలగించండి